- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Sunday, 13 April 2014

మైసూర్ పాక్

కావలసిన పదార్థములు:

శనగపిండి: 1 గ్లాసు
పంచదార: 2 గ్లాసులు
నెయ్యి: 2గ్లాసులు

తయారుచేయువిధానం:

౧. ముందుగా బాణలిలో నెయ్యి వేసి శనగపిండిని దోరగా వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలి.
౨. ఒక గిన్నెలో పంచదార వేసి, ఒక కప్పు నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టాలి.
౩. పంచదార కరిగి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ మంట తగ్గించుకొని శనగపిండి వేయాలి.
౪. కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఒక పదినిమిషాలు (గరిటెకు అంటుకోకుండా ఉండేవరకు) బాగా కలుపుతూ ఉండాలి.
౫. ఒక ప్లేటుకు నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి వేడిగా ఉన్నప్పుడు ముక్కలుగా కోసుకోవాలి. 

No comments:

Post a Comment