- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Tuesday, 5 August 2014

కిచిడీ

చాలా సింపుల్ గా అయిపోయే రైస్ ఐటం ఇది.పప్పులు.బియ్యం జత
కలవడంతో ఫుల్ మీల్ అయిపోతుంది. పిల్లలకీ,పెద్దవాళ్ళకీ చాలా
హెల్దీ ఫుడ్ కూడా

కావలసిన పదార్ధాలు:

బియ్యం రెండు కప్పులు
పెసరపప్పు ఒక కప్పు
మసూర్ దాల్ అర కప్పు
(ఎర్ర కందిపప్పు )
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర ఒక కట్ట
కారట్ తురుము ఒక కప్పు
టమాటా ఒకటి
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూను
గరం మసాలా పొడి ఒక టీ స్పూను
నూనె రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి రెండు టీ స్పూన్లు
ఉప్పు తగినంత
పసుపు కొంచెం

తాలింపుకు
శనగపప్పు,ఆవాలు,జీలకర్ర ,మిరియాలు,ఎండుమిర్చి

తయారుచేసే విధానం :

బియ్యం,పప్పులు కడిగి ఒక పావుగంట నానబెట్టాలి.
నూనె,నెయ్యి కలిపి వేడి చేసి తాలింపు వేసి దోరగా వేయించాలి.  జీలకర్ర, మిరియాలు కొంచెం ఎక్కువ వేస్తే రుచి బావుంటుంది.
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించి కారట్ తురుము, టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి.
ఇప్పుడు కొత్తిమీర,అల్లంవెల్లుల్లి ముద్ద,పసుపు,గరంమసాలాపొడి అన్నీ వేసి కొంచెం వేయించాలి.
చివరగా నానబెట్టిన బియ్యం,పప్పులు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి సరిపడా నీళ్ళు,తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
వేడివేడిగా వడ్డిస్తే ఘుమఘుమలాడుతూ కిచిడీ నోరూరిస్తుంది.
ఇష్టం ఉన్నవారు ఇంకా కూరగాయలు కూడ వేసుకోవచ్చు.

No comments:

Post a Comment