నల్ల నువ్వులు 50gms
ఎండు ఖర్జూరం పొడి 50gms
వేరుశనగ గుండ్ల పొడి 50gms
బెల్లం పొడి 50gms
నల్లనువ్వులు, వేరుశనగ గుండ్లు వేయించి
పొడి చేసుకోవాలి. అలాగే ఖర్జూరాలు గింజ తీసి పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం కూడా
పొడి చేసుకొని అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈవిధంగా తయారు చేసుకున్న దానిని రోజూ
ఉసిరికాయ ప్రమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకొని గోరువెచ్చని పాలు
త్రాగితే రక్తహీనత తగ్గుతుంది.
---------
100గ్రాముల తేనెలో 25 గ్రాముల ఎండు
ఖర్జూరం ముక్కలు, 25 గ్రాముల బాదం పలుకులు, 25 గ్రాముల కిస్ మిస్ లు, 25 గ్రాముల
పటికబెల్లం పొడి వేసి కలిపి ఉంచుకొని రోజూ ఉదయం సాయంత్రం ఒక స్పూన్ తీసుకుని ఒక
కప్పు గోరువెచ్చని పాలు త్రాగుతూ ఉంటే రక్తహీనత తగ్గుతుంది.
No comments:
Post a Comment